10th Class Public Exams: పదో తరగతి విద్యార్థులకు గుడ్న్యూస్..
Sakshi Education
సాక్షి, ఎడ్యుకేషన్: తెలంగాణలో టెన్త్ పబ్లిక్ పరీక్షలు రాయనున్న విద్యార్థులకు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుభవార్త చెప్పింది.
తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
టెన్త్ పరీక్షలను మే 23 నుంచి జూన్ 1 వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్ష సమయాన్ని 30 నిమిషాలు పొడిగించారు.గతంలో పరీక్ష సమయం 2 గంటల 45 నిమిషాలు ఉండగా.. ఇప్పుడు 3 గంటల 15 నిమిషాలకు పెంచారు.అలాగే 6 పేపర్లతోనే పరీక్షను నిర్వహించనున్నారు. అలాగే 70 శాతం సిలబస్ నుంచే ప్రశ్నలు ఇవ్వనున్నారు. కరోనాతో పదో తరగతి క్లాసులు ఆలస్యం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.