AP DSC Notification 2023 : ఆగస్టులో డీఎస్సీ నోటిఫికేషన్..? పూర్తి వివరాలు ఇవే..
Sakshi Education
సాక్షి ఎడ్యుకేషన్ : త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ జులై 11వ తేదీ(మంగళవారం) తెలిపారు.
Botsa Satyanarayana
ఆగస్టులో డీఎస్సీ ప్రకటన ఉండే అవకాశముందన్నారు. అలాగే ఉపాధ్యాయ ఖాళీల భర్తీ ప్రకటన కోసం సీఎం కసరత్తు చేస్తున్నారని మంత్రి బొత్స వెల్లడించారు.
ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి..
రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దశల వారీగా టీచర్ పోస్టులు భర్తీ చేశామన్నారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు ప్రస్తుతం ఉండాల్సిన టీచర్ పోస్టులు ఎన్ని? వాటిలో ఎన్ని పోస్టులు భర్తీ అయ్యాయి? ఇంకా ఎన్ని పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది? అనే అంశాలపై నివేదిక సిద్ధం చేస్తున్నామన్నారు. నివేదికను సీఎంకు వివరించి ఆయన తదుపరి ఆదేశాల మేరకు ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామన్నారు.