Skip to main content

Paul Dhinakaran: కారుణ్య వర్సిటీ–ఈటీఎస్‌ మధ్య ఒప్పందం

సాక్షి, హైదరాబాద్‌: కారుణ్య డీమ్డ్‌ యూనివర్సిటీ.. ఈటీఎస్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌తో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది.
Karunya Deemed University and ETS India Collaboration  Agreement between Karunya Varsity and ETS   Karunya Deemed University

ఈమేరకు డిసెంబ‌ర్ 19న‌ మెమోరాండం ఆఫ్‌ అగ్రిమెంట్‌పై సంతకం చేసింది. ఈ ఒప్పందంలో భాగంగా ఈటీఎస్‌ కారుణ్య క్యాంపస్‌కు డిజిటల్‌ ల్యాబ్‌ను స్పాన్సర్‌ చేసింది. అలాగే విద్యార్థులకు టోఫెల్, జీఆర్‌ఈ వంటి మాక్‌ టెస్టులను నిర్వహిస్తుంది.

చదవండి: Australia Says No To TOEFL: ఆస్ట్రేలియా వెళ్లాలనుకుంటున్నారా... ఇక టోఫెల్ కి చెక్!

ఆంగ్ల భాషలో ప్రావీణ్యంపై దృష్టి సారించే వర్క్‌షాప్‌లతో సహా ప్రత్యేక జీఆర్‌ఈ, టోఫెల్‌ మాస్టర్‌ క్లాస్‌లను కూడా నిర్వహించనుంది. అలాగే ఈ ఒప్పందం ద్వారా ఈటీఎస్‌ రిసోర్స్‌ సెంటర్‌ నిర్వహించే శిక్షణ కార్యక్రమాలు, ఒలింపియాడ్స్‌లో కారుణ్య వర్సిటీ విద్యార్థులకు ప్రవేశం ఉంటుంది. ఈ ఒప్పందం అంతర్జాతీయ వర్సిటీల్లో అడ్మిషన్లు కోరుకునే విద్యార్థులకు పలు మార్గాలను సూచిస్తుందని వర్సిటీ చాన్స్‌లర్‌ పాల్‌ దినకరన్‌ పేర్కొన్నారు.   

చదవండి: Changes in TOEFL: టోఫెల్‌.. కీలక మార్పులు ఇవే!

sakshi education whatsapp channel image link

Published date : 20 Dec 2023 12:38PM

Photo Stories