School holidays: దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు
Sakshi Education
![School holidays](/sites/default/files/images/2023/10/16/dussehraholidays-1697427754.jpg)
గుంటూరు ఎడ్యుకేషన్: దసరా పండుగను పురస్కరించుకుని ప్రభుత్వం ప్రకటించిన సెలవుల్లో విద్యార్థులకు ఎటువంటి తరగతులు నిర్వహించరాదని డీఈఓ పి.శైలజ శుక్రవారం ఓప్రకటనలో తెలిపారు. అన్ని యాజమాన్యాల్లోని పాఠశాలలకు శనివారం నుంచి ఈనెల 24వ తేదీ వరకు సెలవులుగా పరిగణించాలని, క్రిస్టియన్ మైనార్టీ పాఠశాలలకు ఈనెల 21 నుంచి 24 వరకు దసరా సెలవులు ప్రకటించినట్లు పేర్కొన్నారు.
సెలవు రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ తరగతులు నిర్వహించరాదని, ప్రభుత్వ ఉత్తర్వులకు విరుద్దంగా తరగతులు నిర్వహించే యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలోని ఉప విద్యాశాఖాధికారులు, మండల విద్యాశాఖాధికారులు తమ పరిధిలోని పాఠశాలల్లో తరగతులు నిర్వహించకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
Published date : 16 Oct 2023 09:12AM