Skip to main content

AP Residential School: విద్యార్థులకు కొత్త ట్యాబ్‌లు

New tab for students in andhra pradesh

తిరుపతి ఎడ్యుకేషన్‌ : బైజూస్‌ కంటెంట్‌తో ప్రభుత్వం అందజేసిన ట్యాబ్‌లలో దెబ్బతిన్న వాటి స్థానంలో కొత్తవి పంపిణీ చేస్తున్నట్లు ఐటీ మానిటరింగ్‌ అధికారి రమేష్‌ తెలిపారు. శుక్రవారం రేణిగుంటలోని ఏపీ రెసిడెన్షియల్‌ బాలుర పాఠశాల, బాలికల జెడ్పీ హైస్కూల్‌ను సందర్శించారు. బాలుర రెసిడెన్షియల్‌ పాఠశాలలో 80మంది విద్యార్థుల ట్యాబ్‌లను పరిశీలించి లోపాలను సరిదిద్దారు. అలాగే బాలికల పాఠశాలలో 9వ తరగతి విద్యార్థుల ట్యాబ్‌లను పరిశీలించి సాఫ్ట్‌వేర్‌ లోపాలను సరిచేశారు. మరికొందరికి కొత్త ట్యాబ్‌లు అందించారు. తిరుపతి జిల్లా బైజూస్‌ నోడల్‌ అధికారి సురేష్‌ మాట్లాడుతూ ట్యాబ్‌ డిస్‌ప్లే పగిలిపోతే సమీప సచివాలంలోని డిజిటల్‌ అసిస్టెంట్‌ లేదా వెల్ఫేర్‌ ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్లకు అందజేయాలని సూచించారు.

చ‌ద‌వండి: Best Teacher Awards 2023: ముగ్గురికి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు

Published date : 02 Sep 2023 06:50PM

Photo Stories