ఎర్రగుంట్ల: విద్యార్థి దశలో ఎలా ఉండాలి? క్రమశిక్షణతో ఎలా మెలగాలి? అంశాలపై కలెక్టర్ విజయరామరాజు విద్యార్థులకు పాఠాలు చెప్పారు. పలు ప్రశ్నలు సంధిస్తూ సమాధానాలు రాబట్టారు. గంటకు పైగా మాట్లాడి వారి మనోభావాలు తెలుసుకున్నారు.
విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్న జిల్లా కలెక్టర్ విజయరామరాజు
ఎర్రగుంట్ల పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలను గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. 9, 10వ తరగతి గదులకు వెళ్లి ఉపాధ్యాయుల బోధనను పరిశీలించారు. అనంతరం ప్రతి విద్యార్థితో మాట్లాడి వారి లక్ష్యం తెలుసుకున్నారు. వెనుకబడి ఉన్నవారిపై చొరవ చూపాలని ఉపాధ్యాయుడికి సూచనలు చేశారు. అదే పాఠశాలలో ‘నాడు–నేడు’ పనులను ఆయన పరిశీలించారు.