గార్ల: గార్లలోని కస్తూర్బాగాంధీ పాఠశాలలో సుమారు 50 మంది విద్యార్థినులకు కళ్ల కలక వ్యాధి సోకడంతో ముల్కనూరు పీహెచ్సీ ఆధ్వర్యంలో జూలై 31న వైద్యశిబిరం ఏర్పా టు చేశారు.
KGBVలో 50మంది విద్యార్థినులకు కళ్ల కలక
విద్యార్థినులకు డాక్టర్ నవీన్కుమార్ వైద్య పరీక్షలు చేసి కంటి చుక్కల మందును పంపిణీ చేశారు. కళ్ల కలక అంటు వ్యాధి అని, నివారణకు ప్రతీ ఒక్కరు చుక్కల మందు వాడాలన్నారు. మరొకరికి సోకకుండా కళ్లజోళ్లు పెట్టుకోవాలని సూచించారు. శిబిరంలో పాఠశాల స్పెషల్ ఆఫీసర్ ఉషారాణి, పీహెచ్సీ హెల్త్ సూపర్వైజర్ ఇస్మాయిల్ బేగ్, అనీల, పార్వతి, ఆశవర్కర్లు పాల్గొన్నారు. చదవండి: