Skip to main content

Results: బీఈడీ, ఎంఈడీ సెమిస్టర్‌ ఫలితాలు విడుదల

Yogi Vemana University Semester results

వైవీయూ: యోగి వేమన విశ్వవిద్యాలయం అనుబంధ బీఈడీ, ఎంఈడీ సెమిస్టర్‌ పరీక్షల ఫలితాలను విశ్వవిద్యాలయం వైస్‌ చాన్సలర్‌ ఆచార్య చింతాసుధాకర్‌, పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య ఎన్‌.ఈశ్వరరెడ్డి గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ బీఈడీ ప్రథమ సెమిస్టర్‌ పరీక్షలకు 2203 మంది హాజరుకాగా, 1959 మంది ఉత్తీర్ణులయ్యారన్నారు. ఎంఈడీ ఒకటి, నాలుగు సెమిస్టర్‌ పరీక్షలకు 149 మంది హాజరు కాగా 137 మంది ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సహాయ పరీక్షల నియంత్రణ అధికారి డా. ఆదినారాయణరెడ్డి పాల్గొన్నారు.

చ‌ద‌వండి: Supplementary Exam: 9 నుంచి బ్యాక్‌లాగ్‌ సబ్జెక్టుల సప్లిమెంటరీ పరీక్షలు

Published date : 06 Oct 2023 03:37PM

Photo Stories