NEET 2023: మెడికల్ సీట్లు సాధించిన విద్యార్థులకు అభినందన
Sakshi Education
తిమ్మాపూర్: నీట్లో స్టేట్ ర్యాంక్లు సాధించిన తిమ్మాపూర్ మండలానికి చెందిన ఇద్దరు విద్యార్థులు మెడికల్ సీట్లు పొందారు.
మెడికల్ సీట్లు సాధించిన విద్యార్థులకు అభినందన
నుస్తులాపూర్ చెందిన సాయికిరణ్ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాలలో, మన్నెంపల్లికి చెందిన కామెర వినయ్ మహబూబాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో సీటు సాధించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నుస్తులాపూర్ సర్పంచ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రావుల రమేశ్, రాష్ట్ర నాయకుడు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డిలు ఆదివారం వారిని అభినందించి, సత్కరించారు.
రాష్ట్రంలో వైద్యానికి ఉన్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని, కేంద్ర సహకారం లేకపోయినా సీఎం కేసీఆర్ వైద్య కళాశాలలను ఏర్పాటు చేశారని తెలిపారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్లు బేతి శ్రీనివాస్రెడ్డి, పొన్నం అనిల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: MBBS Admissions: ఎంబీబీఎస్ ఫస్టియర్ సీట్లకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్