ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల విద్యాలయాల సంస్థకు చెందిన విద్యార్థులు మరోసారి తమ సత్తా చాటారు.
నీట్లో గురుకుల విద్యార్థుల ప్రభంజనం
నీట్లో అత్యంత ప్రతిభ కనబరిచి మెడికల్, డెంటల్ సీట్లను సాధించారు. మొత్తం 127 మంది నీట్ పరీక్షలకు హాజరుకాగా, వారిలో 104 మంది ఉత్తీర్ణులైనట్లు ఆం««ధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి హర్షవర్థన్ నవంబర్ 2న ఒక ప్రకటనలో తెలిపారు. వారిలో 17 మంది ఎంబీబీఎస్, 21 మంది డెంటల్ సీట్లు సాధించగలరన్నారు.