Skip to main content

పీజీ విద్యార్థులకు విద్యా దీవెన, వసతి దీవెన

సాక్షి, అమరావతి: కన్వీనర్ కోటాలో సీటు పొంది రాష్ట్ర ప్రభుత్వ వర్సిటీలు, కాలేజీల్లో పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సులు చేస్తున్న వారికి జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాలను వర్తింప చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ మేరకు సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి బి.రాజశేఖర్ శుక్రవారం ఉత్తర్వులిచ్చారు. ప్రైవేట్, ఎయిడెడ్ కాలేజీల్లో పీజీ చదువుతున్న వారికి ఈ పథకాలు వర్తించవని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Published date : 26 Dec 2020 02:25PM

Photo Stories