Health of students: విద్యార్థుల ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలి
Sakshi Education
![Health care of tribal students](/sites/default/files/images/2023/08/07/health-students-1691401969.jpg)
నార్నూర్: గిరిజన విద్యార్థుల ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలని జీసీడీవో ఛాయ అన్నారు. గాదిగూడ మండలంలోని ఆర్జుని బాలికల ఆశ్రమ పాఠశాలతోపాటు కొలాంగూడ శాటిలైట్ సెంటర్ను ఆదివారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల ఆరోగ్యంపై ఆరా తీశారు. పాఠశాలలో వసతి గృహాలతోపాటు వంట గదులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలన్నారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, డార్మెంటరీ పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. ఆమె వెంట వార్డెన్లు ఆశోక్, బాబు తదితరులు ఉన్నారు.
Published date : 07 Aug 2023 03:22PM