కొడకండ్ల: తరగతి గది విద్యార్థి భవిష్యత్కు పునాది లాంటిదని డీఆర్పీ రామావజ్జుల అనిల్ అన్నారు. ఆగస్టు 4న మండలకేంద్రంలోని ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న తొలిమెట్టు శిక్షణ కార్యక్రమాన్ని ఆయన సందర్శించి మాట్లాడారు.
తరగతి గది విద్యార్థి భవిష్యత్కు పునాది
1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు ప్రభుత్వం వర్క్బుక్లను అందిస్తుందని, విద్యార్థులకు అవసరమైన సామర్థ్యాలను గుర్తించి పెంపొందించేందుకు తొలి మెట్టు శిక్షణ దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల నోడల్ ఆఫీసర్ గ్రేస్కేజీయారాణి, కోర్స్ ఇన్చార్జ్ రజీయాబేగం, ఆర్పీలు పసునూరి ఉమేష్, శ్రీనివాసచారి తదితరులు పాల్గొన్నారు.