Skip to main content

వలంటీర్ల ఉద్యోగాలు మరో ఏడాది పొడిగిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు

సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు వలంటీర్ల ఉద్యోగాలను మరో ఏడాది పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులిచ్చింది.
వలంటీర్ వ్యవస్థకు శ్రీకారం చుట్టిన సీఎం వైఎస్ జగన్ గతేడాది ఆగస్టు 15న రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, పట్టణ ప్రాంతాల్లో కలిపి 2.60 లక్షల మంది వలంటీర్లను నియమించారు. అప్పట్లో ప్రాథమికంగా ఏడాది కాలానికి గానూ వారికి నియామక పత్రాలు అందించారు. ఆ సమయం ముగియడంతో వారి ఉద్యోగ వ్యవధిని మరో ఏడాది పొడిగిస్తూ గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్ ఉత్తర్వులిచ్చారు.
Published date : 01 Oct 2020 12:51PM

Photo Stories