Skip to main content

Inter Exams: యథావిధిగా నేటి ఇంటర్‌ పరీక్ష

Inter Exams as usual
Inter Exams as usual
  • తదుపరి షెడ్యూల్‌ 
  • పరీక్షలూ యథాతథం 

సాక్షి, అమరావతి: ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలకు సంబంధించి గురువారం జరగాల్సిన పరీక్ష యథావిధిగా జరుగుతుందని ఇంటర్‌ విద్యా మండలి కార్యదర్శి ఎంవీ శేషగిరిబాబు పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఇంటర్‌ సెకండియర్‌ మేథమేటిక్స్‌ పేపర్‌ 2ఏ, బోటనీ పేపర్‌ 2, సివిక్స్‌ పేపర్‌ 2 పరీక్షలు యథావిధిగా గురువారం షెడ్యూల్‌ సమయం ప్రకారం జరుగుతాయని చెప్పారు. ఈ విషయాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు గమనించాలన్నారు. ఆ తదుపరి పరీక్షలు కూడా షెడ్యూల్‌లో పేర్కొన్న తేదీలలో య«థాతథంగా కొనసాగుతాయన్నారు. తుపాను కారణంగా బుధవారం (11వ తేదీన) నిర్వహించాల్సిన ఫస్టియర్‌ పరీక్షను ఈ నెల 25వ తేదీకి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఆ ఒక్క పరీక్ష తప్ప తక్కిన పేపర్లన్నీ ముందుగా నిర్ణయించిన తేదీల్లోనే జరుగనున్నాయి.   

Also read: Scholarship: ఉపకార దరఖాస్తుకు మరో అవకాశం

Published date : 12 May 2022 03:46PM

Photo Stories