Skip to main content

ఇంటర్‌లో ప్రవేశానికి గడువు జూలై 31 వరకు పెంపు

సాక్షి, హైదరాబాద్‌: 2021–22 విద్యా సంవత్సరానికి ఇంటర్‌ ఫస్టియర్‌ ప్రవేశాల గడువును జూలై 31 వరకు పొడిగించారు.
ఈ సందర్భంగా ప్రైవేటు కళాశాలలు నిబంధనలు పాటించాలని ఇంటర్మీడియెట్‌ బోర్డు కార్యదర్శి జలీల్‌ గురువారం ఆదేశించారు. కొన్ని కాలేజీలు అనుమతి లేకుండా ప్రవేశాలు చేపట్టినట్లు ఫిర్యాదులు వచ్చాయని పేర్కొన్నారు. నిబంధనలు పాటించని కాలేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉత్తర్వులు జారీ చేసే వరకు ప్రత్యక్ష తరగతులు నిర్వహించొద్దన్నారు.

తెలంగాణ ఇంటర్మీడియ్‌– 2021 సిలబస్, స్టడీ మెటీరియల్, బిట్‌ బ్యాంక్స్, మోడల్‌ పేపర్లు, ప్రీవియస్‌ పేపర్లు, ప్రాక్టికల్‌ గైడెన్స్, కెరీర్‌ గైడెన్స్‌.. ఇతర అప్‌డేట్స్‌ కోసం క్లిక్‌ చేయండి.
Published date : 09 Jul 2021 03:52PM

Photo Stories