Skip to main content

Group 4: గ్రూప్ 4 ప‌రీక్ష‌లో ఈ త‌ప్పులు అస్స‌లు చేయ‌కండి... లాస్ట్ మినిట్ టిప్స్ మీకోసం

టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-4 పోస్టుల భర్తీకి జులై 1వ తేదీన రాత‌ప‌రీక్ష‌ను నిర్వ‌హిస్తున్నారు. ఈ ప‌రీక్ష కోసం తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (TSPSC) పకడ్భందీగా ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వ విభాగాల్లో 8,180 గ్రూప్‌-4 పోస్టులకు జులై 1న నిర్వహించనున్న రాతపరీక్షకు 9.51 లక్షల మంది దరఖాస్తు చేశారు. ఇప్ప‌టికే హాల్‌టికెట్ల‌ను క‌మిష‌న్ విడుద‌ల‌చేసింది.
TSPSC Group 4 Exam
TSPSC Group 4 Exam

ధికారులు ఎంత‌ముందుగా అభ్య‌ర్థుల‌కు సూచ‌న‌లు చేస్తున్నా ప‌రీక్ష రోజు చిన్న చిన్న త‌ప్పులు చేస్తూ ప‌రీక్ష‌ను మిస్ అవుతున్నారు. ఇటీవ‌ల నిర్వ‌హించిన గ్రూప్ 1 ప‌రీక్ష‌లోనూ హైద‌రాబాద్‌, వ‌రంగ‌ల్‌లో ఇద్ద‌రు అభ్య‌ర్థులు నిర్ణీత స‌మ‌యానికి చేరుకోలేక‌పోవ‌డంతో ప‌రీక్ష‌ను మిస్ అయ్యారు. 

ఇలాంటి నేప‌థ్యంలో అభ్య‌ర్థులు ఒత్తిడికి లోనుకాకుండా ప‌రీక్ష స‌మ‌యం కంటే ఎంత‌వీలుంటే అంత ముందుగా చేరుకుంటే మంచిది. ప‌రీక్ష కేంద్రానికి ముందుగా చేరుకుంటే ఎలాంటి టెన్ష‌న్ లేకుండా ప‌రీక్ష రాసేందుకు వీలుంటుంది. అలాగే మ‌రో రెండు రోజుల్లో నిర్వ‌హించనున్న గ్రూప్ 4 ప‌రీక్ష‌లో ఈ కింది త‌ప్పులు అస్స‌లు చేయ‌కండి.

చదవండి: Groups Books: గ్రూప్-1&2కు కచ్చితంగా చదవాల్సిన పుస్తకాలు.. వీటి జోలికి అసలు వెళ్లోద్దు..! 

 
☛ పరీక్ష ప్రారంభానికి 15 నిమిషాల ముందే ఎగ్జామ్ సెంటర్ల గేట్లు మూసివేస్తామని టీఎస్పీఎస్సీ స్పష్టం చేసింది. 

☛ ఉదయం పేపర్-1 పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించనుండగా.. 9.45 గంటలు దాటిన తర్వాత అభ్యర్థులను లోనికి అనుమతించరు. 

☛ మధ్యాహ్యం ఎగ్జామ్ 2:30 గంటల నుంచి 5 గంటల వరకు నిర్వహించనుండగా.. 2.15 తరువాత ఎగ్జామ్ సెంటర్లలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని కమిషన్ స్పష్టం చేస్తోంది. పేపర్-1కు ఉదయం 8 గంటల నుంచి, పేపర్-2కు మధ్యాహ్నం ఒంట గంట నుంచి కేంద్రంలోకి అనుమతించనున్నారు.

☛ ఈ నిబంధన నేపథ్యంలో అభ్యర్థులు చివరి నిమిషంలో ఇబ్బందులు పడకుండా సకాలంలో ఎగ్జామ్ సెంటర్లకు చేరుకోవాలని కమిషన్ కోరుతోంది.

చ‌ద‌వండి: Groups Preparation Tips: గ్రూప్స్‌..ఒకే ప్రిపరేషన్‌తో కామన్‌గా జాబ్‌ కొట్టేలా!
 
☛ ఎలక్ట్రానిక్ పరికరాలు, రిమోట్ తో కూడిన కారు తాళాలు, నిషేధిత, విలువైన వస్తువులు తీసుకురావద్దని కమిషన్ సూచించింది. ఇంకా షూలు ధరించి రావొద్దని.. కేవలం చెప్పులతో మాత్రమే రావాలని తెలిపింది. 

☛ అభ్యర్థులను తనిఖీ తరువాత కేంద్రంలోకి అనుమతించనున్నారు. దాదాపు 9.51 లక్షల మంది అభ్యర్థులు హాజరుకానున్న నేపథ్యంలో వేలిముద్రను తప్పనిసరి చేశారు. అభ్యర్థులు ప్రతీ సెషన్ ఎగ్జామ్ ముగిసిన తర్వాత ఓఎంఆర్ షీట్ ను ఇన్విజిలేటర్ కు అందించి వేలిముద్ర వేయాల్సి ఉంటుంది. 

☛ ఎగ్జామ్ సెంటర్లలోకి ప్రవేశించే ముందు భద్రతా సిబ్బందికి, పరీక్ష గదిలోకి చేరుకున్నాక ఇన్విజిలేటర్ కు ఫొటో గుర్తింపు కార్డు చూపించాలి. అభ్యర్థి కాకుండా వేరే వ్యక్తులు హాజరైతే కఠిన చర్యలతో పాటు, ప్ర‌భుత్వ‌ పరీక్షలకు అనర్హుడిగా ప్రకటించనున్నారు. 

☛ టీఎస్‌పీఎస్సీ Group 4 ఉద్యోగాల స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

☛ ఓఎంఆర్ షీట్లో బ్లూ/బ్లాక్ పెన్ తో అభ్యర్థులు పేరు, కేంద్రం కోడ్, హాల్ టికెట్, ప్రశ్నపత్రం నంబరు రాయాల్సి ఉంటుందని కమిషన్ తెలిపింది.

☛ హాల్ టికెట్, ప్రశ్నపత్రం నంబరు సరిగా రాయకున్నా, బ్లూ బ్లాక్ బాల్ పాయింట్ పెన్ కాకుండా ఇంక్ పెన్, జెల్ పెన్, పెన్సిల్ ఉపయోగించినా ఓఎంఆర్ షీట్ చెల్లదని కమిషన్ స్పష్టం చేస్తోంది.

Published date : 30 Jun 2023 04:00PM

Photo Stories