Skip to main content

APPSC Group-1 Ranker Success Story : ఏవిధమైన కోచింగ్ లేకుండానే.. గ్రూప్-1 కొట్టానిలా..

ఏపీపీఎస్సీ గ్రూప్‌–1 (2018) ఫైన‌ల్ ఎంపిక జాబితాను ఇటీవ‌లే విడుద‌ల చేసిన విష‌యం తెల్సిందే. 2018 డిసెంబర్‌లో మొత్తం 167 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది.
APPSC Group-1 Ranker Success Story
APPSC Group-1 Ranker Success Story

ఈ నేప‌థ్యంలో గ్రూప్‌–1లో ఫ‌లితాల్లో మంచి ర్యాంక్ సాధించి అసిస్టెంట్‌ ట్రెజరీ ఆఫీసర్‌ ఉద్యోగానికి ఎంపికైన పుజా విహారి స‌క్సెస్ స్టోరీ మీకోసం..

కుటుంబ నేప‌థ్యం : 
తూర్పుగోదావ‌రి జిల్లా కొవ్వూరు మండ‌లం ధర్మవరం గ్రామానికి చెందిన వారు కుందుల పుజా విహారి. తండ్రి బాల గంగాధర తిలక్‌ రైల్వే ఉద్యోగి, తల్లి దేవి కొవ్వూరు ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలలో సివిక్స్‌ లెక్చరర్‌గా పనిచేస్తున్నారు.

చ‌ద‌వండి: Indian Polity Notes for Competitive Exams: ద్విసభా పద్ధతి అమల్లో ఉన్న రాష్ట్రాలేవి?

ఎడ్యుకేష‌న్ :
ధర్మవరం స్వర్ణ భారతీ స్కూలులో పదో తరగతిలో 9.7 మార్కులతోను, ఇంటర్‌లో కొవ్వూరు నారాయణలోను 967 మార్కులతో పాసైనట్లు తెలిపారు. డిగ్రీ కొవ్వూరు ఏబీఎన్‌ పీఆర్‌ఆర్‌ కళాశాలలోను, పీజీ ఆంధ్రా యూనివర్శిటీలో చదివినట్టు తల్లిదండ్రులు తెలిపారు.    

ఏవిధమైన కోచింగ్‌ తీసుకోకుండానే..
ఒక ప్ర‌ణాళిక ప్ర‌కారం చ‌దివి.. గ్రూప్‌–1 ఆఫీసర్‌గా ఎంపికయ్యారు. ఇటీవల విజయవాడలో నిర్వహించిన ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ఇంటర్వ్యూలో అసిస్టెంట్‌ ట్రెజరీ ఆఫీసర్‌గా ఎంపికయ్యారు. ఏవిధమైన కోచింగ్‌ తీసుకోకుండానే గ్రూపు–1కి ఎంపిక కావడం ఆనందంగా ఉందని తల్లిదండ్రులు చెబుతున్నారు. గతంలో సచివాలయ కార్యదర్శి పోస్టుకి స్టేట్‌లో రెండో ర్యాంకు సాధించారు. గత ఏడాది ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌గా ఎంపికైనట్లు తెలిపారు. ఎలాగైనా గ్రూపు–1 అధికారి కావాలన్న ఆకాంక్షతో చదివారన్నారు.

చ‌ద‌వండి: Indian Polity Bit Bank for Competitive Exams: ఈ కింది ఏ దశాబ్దంలో ఎక్కువ రాష్ట్రాలు ఏర్పాటయ్యాయి?

తొలిసారిగా గ్రూప్‌–1ను..
2018 డిసెంబర్‌లో మొత్తం 167 పోస్టుల (2 స్పోర్ట్స్‌ కోటాతో కలిపి) నోటిఫికేషన్‌ ఇచ్చారు. 2019 మేలో గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌కు 1,14,473 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో 58,059 మంది మెయిన్స్‌కు అర్హత సాధించారు. తరువాత కరోనా, ఇతర కారణాల వల్ల మెయిన్స్‌ పరీక్షలు మూడుసార్లు వాయిదా పడ్డాయి. 2020 డిసెంబర్‌లో మెయిన్స్‌ పరీక్షలను ట్యాబ్‌ ఆధారిత ప్రశ్నపత్రాలతో అత్యంత పకడ్బందీగా నిర్వహించారు. తొలిసారిగా గ్రూప్‌–1 సమాధాన పత్రాల మూల్యాంకనాన్ని డిజిటల్‌ విధానంలో చేశారు.

ఈ సారి ఇంటర్వ్యూలను మాత్రం..
2021 ఏప్రిల్‌లో వీటి ఫలితాలు విడుదల చేయగా కొంతమంది అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఇచ్చిన తీర్పుతో మూల్యాంకనాన్ని సంప్రదాయ పద్ధతిలో మ్యాన్యువల్‌గా అత్యంత పారదర్శకంగా చేయించారు. మొత్తం మూల్యాంకన ప్రక్రియను సీసీ కెమెరాల్లో చిత్రీకరించి భద్రపరిచారు. అనంతరం మూడు బోర్డులను ఏర్పాటు చేసి ఇంటర్వ్యూలను పూర్తి చేశారు. బోర్డుల్లో కూడా కమిషన్‌ సభ్యులు ఇద్దరితోపాటు ఇద్దరు ఆలిండియా సర్వీసు సీనియర్‌ అధికారులు, సబ్జెక్టు నిపుణులు ఉన్నారు.

చ‌ద‌వండి: Indian Polity for Competitive Exams: కేంద్ర ప్రభుత్వం – నిర్మాణం, అధికారాలు

Published date : 03 Aug 2022 07:17PM

Photo Stories