Skip to main content

ప్రపంచ క్షయ దినోత్సవం ఎప్పుడు పాటిస్తారు?

క్షయవ్యాధి సోకడం వ‌ల్ల క‌లిగే ఆరోగ్య, సామాజిక, ఆర్థిక పరిణామాలపై ప్రజలలో అవగాహన పెంచడం, ఈ అంటువ్యాధిని అరికట్టే ప్రయత్నాలను వేగవంతం చేయడం ల‌క్ష్యంగా మార్చి 24న ప్రపంచ క్షయ దినోత్సవం నిర్వహిస్తారు.

1882లో డాక్టర్ రాబర్ట్ కోచ్ క్షయవ్యాధి (మైకోబాక్టీరియం ట్యూబ‌ర్‌కూలోసిస్‌)ను కనుగొన్న సంద‌ర్భంగా మార్చి 24ను ఎంపిక చేశారు. క్షయవ్యాధి ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతక అంటు వ్యాధిగా నిలిచింది. ప్రతి రోజు, 4000 మందికి పైగా క్షయవ్యాధితో మరణిస్తున్నారు. 30,000 మంది ప్రజలు ఈ వ్యాధి కార‌ణంగా అనారోగ్యానికి గురవుతున్నారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ, ది గ్లోబ‌ల్ ఫండ్ అండ్ స్టాప్ ట్యూబ‌ర్‌కూలోసిస్‌తో క‌లిసి Find.Treat.All అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. భారత ప్రభుత్వం క్షయవ్యాధి మహమ్మారిని 2025 నాటికి నివారిస్తుంద‌ని, దేశంలో క్షయవ్యాధి సంభవం, మరణాలను వేగంగా తగ్గించడానికి సంబంధిత వనరులను అందిస్తామని హామీ ఇచ్చింది.

2021 సంవత్సరానికి థీమ్: ది క్లాక్ ఇస్ టిక్కింగ్‌
Published date : 30 Apr 2021 05:39PM

Photo Stories