Skip to main content

RGUKT: ట్రిపుల్‌ ఐటీ కౌన్సెలింగ్‌ తేదీలు ఇవే..

వేంపల్లె : రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వ విద్యాలయం (ఆర్జీయూకేటీ) పరిధిలోని ఇడుపులపాయ, నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీల్లో ప్రవేశాలకు జూలై 20 నుంచి కౌన్సెలింగ్‌ ప్రారంభమవుతుందని ఇడుపులపాయ ఆర్‌కే వ్యాలీ ట్రిపుల్‌ ఐటీ డైరెక్టర్‌ కసిరెడ్డి సంధ్యారాణి తెలిపారు.
triple IT counseling
ట్రిపుల్‌ ఐటీ కౌన్సెలింగ్‌ తేదీలు ఇవే..

ఆమె జూలై 18న విలేకరులతో మాట్లాడుతూ 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి ట్రిపుల్‌ ఐటీల్లో ఆరేళ్ల సమీకృత ఇంజినీరింగ్‌లో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు పదో తరగతి మార్కుల ఆధారంగా ఇప్పటికే కాల్‌ లెటర్లు పంపినట్లు చెప్పారు.

చదవండి: Andhra Pradesh: ట్రిపుల్‌ ఐటీ.. చదువుల దివిటీ

కాల్‌ లెటర్స్‌ వచ్చిన విద్యార్థులు తమకు కేటాయించిన క్యాంపస్‌లలో నిర్దేశించిన తేదీల్లో కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని సూచించారు. జూలై 20న‌ నూజివీడు ట్రిపుల్‌ ఐటీకి, జూలై 21న ఇడుపులపాయ ట్రిపుల్‌ ఐటీకి సంబంధించి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని వివరించారు. కౌన్సెలింగ్‌కు హాజరయ్యే వారికి తగిన సదుపాయాలు కల్పిస్తామన్నారు.

చదవండి: JOSSA: ‘జోసా’ సీట్ల కేటాయింపు.. మీ సీటు ఎక్కడ వచ్చిందో తెలుసుకోండి ఇలా..

Published date : 19 Jul 2023 04:22PM

Photo Stories