JOSSA: ‘జోసా’ సీట్ల కేటాయింపు.. మీ సీటు ఎక్కడ వచ్చిందో తెలుసుకోండి ఇలా..
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: దేశంలోని ప్రతిష్టాత్మక ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే సంస్థల్లో ఇంజనీరింగ్ విభాగంలో సీట్ల కేటాయింపును జూన్ 30న చేపట్టనున్నారు.
‘జోసా’ సీట్ల కేటాయింపు.. మీ సీటు ఎక్కడ వచ్చిందో తెలుసుకోండి ఇలా..
ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసినట్లు ‘జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ’(జోసా) తెలిపింది. తొలి విడత సీట్ల కేటాయింపును ఉదయం 10 గంటలకు ప్రకటిస్తున్నామని, అభ్యర్థులు josaa.nic.in వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ నెంబర్ల ద్వారా సీటు ఎక్కడ వచ్చిందో తెలుసుకోవచ్చని ‘జోసా’పేర్కొంది. సీట్లు పొందిన అభ్యర్థులు జూలై 4లోగా ఆన్లైన్ రిపోర్టింగ్ చేయాలని, అభ్యంతరాలుంటే జూలై 5లోగా పంపాలని సూచించింది.