ఏపీ పీజీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 4వ రోజైన అక్టోబర్ 25న కూడా ప్రశాంతంగా ముగిసింది.
పీజీ సెట్కు 89 శాతం మంది హాజరు
ఉదయం ఎలక్ట్రానిక్స్, జువాలజీ, మధ్యాహ్నం ఎఫ్ఎన్ ఎస్, కంప్యూటర్ సైన్స్, సాయంత్రం సెరికల్చర్, జియాలజీ, సైకాలజీ, జనరల్ టెస్ట్ పరీక్షలు నిర్వహించారు. మొత్తంగా 7,033 మంది అభ్యర్థులకు గాను 6,266 మంది(89.09 శాతం) హాజరయ్యారని పీజీ సెట్ కన్వీనర్ వై.నజీర్ అహ్మద్ తెలిపారు. అక్టోబర్ 26న రాష్ట్రంలోని 53 పరీక్షా కేంద్రాల్లో ఫిజికల్ సైన్స్, పొలిటికల్ సైన్స్ సబ్జెక్టులకు పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు.