PGCET: పీజీసెట్కు 90 శాతం హాజరు
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో పోస్ట్రుగాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహిస్తున్న ఏపీపీజీసెట్–2021కి అక్టోబర్ 24న 90.78 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు.
ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం మూడు సెషన్లుగా నిర్వహించిన ఈ పరీక్షకు 13,719 మంది అభ్యర్థులు దరఖాస్తు చేయగా.. 12,454 మంది హాజరై కంప్యూటర్ ఆధారిత పరీక్ష పూర్తి చేశారు. అక్టోబర్ 24న ఫిజికల్ ఎడ్యుకేషన్, ఎకనామిక్స్, కెమికల్æసైన్సెస్, ఉర్దూ, హిస్టరీ, హిందీ, స్టాటిస్టిక్స్ సబ్జెక్టుల్లో పరీక్షలు నిర్వహించినట్లు సెట్ కన్వీనర్ ఆచార్య వై.నజీర్అహ్మద్ తెలిపారు. సోమవారం ఎలక్ట్రానిక్స్, జువాలజీ, ఎఫ్ఎన్ ఎస్, కంప్యూటర్ సై¯Œ్స, సెరికల్చర్, జియాలజీ, సైకాలజీలతో పాటు జనరల్ టెస్ట్ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
చదవండి:
Published date : 25 Oct 2021 01:38PM