Skip to main content

Guest Lecturers: గెస్ట్‌ లెక్చరర్లకు తీపికబురు

కొన్ని నెలలుగా తీవ్ర మనోవేదన అనుభవిస్తున్న గెస్ట్‌ లెక్చరర్స్‌ (అతిథి అధ్యాపకులు)కు ప్రభుత్వం దసరా సందర్భంగా తీపికబురు చెప్పింది.
Guest Lecturers
గెస్ట్‌ లెక్చరర్లకు తీపికబురు

జూనియర్‌ కాలేజీల్లో గెస్ట్‌ లెక్చరర్లను తీసుకునేందుకు అనుమతిస్తూ ప్రభుత్వ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా అక్టోబర్‌ 12న ఉత్తర్వులు జారీ చేశారు. స్థానిక అవసరాలకు అనుగుణంగా అధ్యాపక ఖాళీలను గుర్తించి, వీరితో భర్తీ చేయాలని జీవోలో పేర్కొన్నారు. అయితే, నియామకాలపై ఇంటర్మీడియెట్‌ బోర్డు మార్గదర్శకాలు విడుదల చేయాల్సి ఉంది. జిల్లాల నుంచి పూర్తిస్థాయి సమాచారం అందిన తర్వాత ఈ ప్రక్రియ పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. ఆ తర్వాత నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 405 ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో 1,654 మంది అతిథి అధ్యాపకులు పనిచేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో వీరికి ఊరట లభించనుంది.

చదవండి: 

తెలంగాణ ఇంట‌ర్ ప‌రీక్ష‌ల స్ట‌డీ మెటీరియ‌ల్‌, సిల‌బ‌స్‌, మోడ‌ల్ పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్ మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

Published date : 13 Oct 2021 04:36PM

Photo Stories