Skip to main content

ఐటీఐలలో ప్రవేశాల కౌన్సెలింగ్‌కు గడువు పొడిగింపు

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఏలూరు జిల్లాలోని 5 ప్రభుత్వ, 14 ప్రైవేట్‌ ఐటీఐలలో 2023–24 విద్యా సంవత్సరానికి మిగిలి ఉన్న సీట్ల భర్తీ నిమిత్తం రెండో విడత కౌన్సెలింగ్‌ ఆన్‌లైన్‌ ప్రక్రియ ద్వారా నిర్వహించడానికి ఈ నెలాఖరు వరకు గడువు పొడిగించినట్లు ఏలూరు ప్రభుత్వ ఐటీఐ ప్రధానాధికారి పి.రజిత బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
 Extension of deadline for admissions counseling in ITIs
ఐటీఐలలో ప్రవేశాల కౌన్సెలింగ్‌కు గడువు పొడిగింపు

విద్యార్థులు ఆన్‌లైన్‌లో ఐటీఐ వెబ్‌సైట్‌లో స్టూడెంట్‌ ఏరియాలో విద్యార్థి ఆన్‌లైన్‌ దరఖాస్తును పూర్తి చేసి ఈ నెల 31వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా సమర్పించాలని సూచించారు. అనంతరం దరఖాస్తు కాపీని ప్రింట్‌ తీసుకుని విద్యార్థి తన ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో తాము ఎంచుకున్న సంబంధిత ఐటీఐలలో ఆగస్టు 1వ తేదీ సాయంత్రం 5 గంటల లోగా వెరిఫికేషన్‌ చేయించుకోవాలని సూచించారు. వెరిఫికేషన్‌ పూర్తయిన వారు మాత్రమే కౌన్సెలింగ్‌కు హాజరుకావడానికి అర్హులన్నారు. ఈ మేరకు ఏలూరు జిల్లాలో ప్రభుత్వ ఐటీఐలల్లో 700 సీట్లు, ప్రైవేట్‌ ఐటీఐలలో 1,712 సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. అలాగే 10వ తరగతి ఉత్తీర్ణులై ఆ పైన చదువుకుని ఉపాధి కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు కూడా ఈ ప్రవేశాలకు అర్హులని, 8వ తరగతి ఉత్తీర్ణులై 10వ తరగతి అనుత్తీర్ణులైన విద్యార్థులు వెల్డర్‌ ట్రేడ్‌కి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులన్నారు. ఇతర వివరాలకు 08812–230269 నంబర్‌లో సంప్రదించవచ్చన్నారు.

Published date : 27 Jul 2023 04:07PM

Photo Stories