TS CPGET 2023: పీజీ కోర్సుల తొలి విడత కౌన్సెలింగ్ ప్రారంభం
Sakshi Education
ఉస్మానియా వర్సిటీ: రాష్ట్రంలోని వివిధ విశ్వ విద్యాలయాల్లో పలు పీజీ కోర్సుల్లో ప్రవేశానికి మొదటి విడత కౌన్సెలింగ్ ప్రారంభమైనట్లు టీఎస్సీపీజీఈటీ–2023 కన్వీనర్ ప్రొ.పాండురంగారెడ్డి సెప్టెంబర్ 5న ఒక ప్రకటనలో తెలిపారు.
పీజీ కోర్సుల తొలి విడత కౌన్సెలింగ్ ప్రారంభం
తొలిరోజు 600 మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని వివరించారు. ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులు ఈ నెల 15 వరకు ఆన్లైన్లో పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు www.osmania.ac.in అనే వెబ్సైట్ చూడవచ్చని తెలిపారు.