Skip to main content

TS EAMCET Counselling 2021: టీఎస్ ఎంసెట్‌ ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌ షురూ..

సాక్షి, హైదరాబాద్‌: ఇంజనీరింగ్‌ కళాశాలల్లో ప్రవేశానికి ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ సోమవారం మొదలైంది.
ఎంసెట్‌లో అర్హత పొందిన అభ్యర్థులు తమ ధ్రువపత్రాల పరిశీలనకు స్లాట్‌ బుక్‌ చేసుకుంటున్నారు. తొలిరోజు మందకొడిగానే ఉన్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. స్లాట్‌ బుక్‌ చేసుకున్నవారికి సెప్టెంబర్‌ 4 నుంచి సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ నిర్వహిస్తారు. దీనికోసం రాష్ట్రవ్యాప్తంగా 36 సహాయ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ధ్రువపత్రాల పరిశీలించాక అభ్యర్థులు వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. వచ్చే నెల 15న తొలిదశ కౌన్సెలింగ్‌లో సీట్లు పొందినవారు 20లోగా కళాశాలల్లో సెల్ఫ్‌ రిపోర్ట్‌ చేయాలి.
Published date : 31 Aug 2021 03:44PM

Photo Stories