Skip to main content

Eamcet Counselling 2021: వచ్చే నెలలోనే ఎంసెట్‌ రెండో విడత కౌన్సెలింగ్‌..ఎందుకంటే..?

సాక్షి, హైదరాబాద్‌: ఇంజనీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే రెండో దశ ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ను నవంబర్‌ మొదటి వారంలో నిర్వహించే వీలుందని ఉన్నత విద్యామండలి అధికారులు తెలిపారు.

మేనేజ్‌మెంట్‌ కోటా సీట్ల కేటాయింపు తుది గడువు అక్టోబ‌ర్ 30 వరకు పొడిగించాలని నిర్ణయించారు. హైకోర్టు తీర్పుతో కొత్తగా వచ్చే కంప్యూటర్‌ సైన్స్‌ గ్రూపు సీట్లను రెండో కౌన్సెలింగ్‌ పరిధిలోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరోవైపు తొలి విడత సీట్లు పొందిన విద్యార్థుల్లో కొంతమంది జాతీయ విద్యాసంస్థల్లోకి వెళ్లే అవకాశముంది. ఈ నేపథ్యంలో ఖాళీ అయ్యే సీట్లను కూడా పరిగణనలోకి తీసుకోవాలని భావిస్తున్నారు. అన్ని సీట్లు కలిపి 50 వేల వరకూ ఉంటాయి. వీటిల్లో సీట్లు వచ్చిన విద్యార్థులు అక్టోబ‌ర్ 30 వరకూ సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేస్తారు.

Published date : 21 Oct 2021 12:16PM

Photo Stories