Skip to main content

టీఎస్‌ ఎంసెట్‌ – 2021 దరఖాస్తుల గడువు జూన్‌ 17 వరకు పెంపు

సాక్షి, హైదరాబాద్‌: ఇంజనీరింగ్‌ ఎంసెట్‌ రాసేందుకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల సంఖ్య గతేడాది కంటే ఈసారి పెరిగింది.
తెలంగాణ ఎంసెట్‌ – 2021 స్టడీ మెటీరియల్, బిట్‌ బ్యాంక్స్, ప్రిపరేషన్‌ గైడెన్స్, ఆన్‌లైన్‌ ప్రాక్టీస్‌ టెస్ట్స్, మోడల్‌ పేపర్స్, మాక్‌ టెస్ట్స్‌... ఇతర తాజా అప్‌డేట్స్‌ కోసం క్లిక్‌ చేయండి.

అగ్రికల్చర్‌ ఎంసెట్‌ రాసేందుకు దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య మాత్రం ఇప్పటివరకు తగ్గింది. గతేడాది ఇంజనీరింగ్‌ ఎంసెట్‌ కోసం 1,43,326 మంది దరఖాస్తు చేసుకోగా, ఈసారి (శుక్రవారం సాయంత్రం వరకు) 1,47,144 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎంసెట్‌ దరఖాస్తుల గడువును ఈనెల 17 వరకు పొడిగించినట్లు ఎంసెట్‌ కన్వీనర్‌ గోవర్ధన్‌ తెలిపారు. విద్యార్థులు ఆలస్య రుసుము లేకుండా ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.

చదవండి: ఓపెన్‌ స్కూల్‌ టెన్త్, ఇంటర్‌ పరీక్షలు వాయిదా
Published date : 12 Jun 2021 02:07PM

Photo Stories