Skip to main content

టీఎస్ ఎంసెట్- 2020 వెబ్ ఆప్షన్ల గడువు నవంబర్ 9 వరకు పొడిగింపు

సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ ప్రవేశాల్లో భాగంగా ఎంసెట్ వెబ్ ఆప్షన్ల గడువును నవంబర్9వ తేదీ వరకు పొడిగించినట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాల చివరి దశ సీట్లను ఈనెల 7వ తేదీన కేటాయించనున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఎంసెట్ ప్రవేశాల వెబ్ ఆప్షన్ల గడువును పొడిగించారు. విద్యార్థులు 9వ తేదీ వరకు వీలైనన్ని ఎక్కువ ఆప్షన్లు ఇచ్చుకోవాలని, 12వ తేదీన సీట్లను కేటాయిస్తామని వెల్లడించారు. సీట్లు పొందిన విద్యార్థులు 17న కాలేజీల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుందని వివరించారు.
Published date : 02 Nov 2020 04:54PM

Photo Stories