Skip to main content

నేడు, రేపు అగ్రి, మెడికల్‌ ఎంసెట్‌– 2021 పరీక్షలు

సాక్షి, హైదరాబాద్‌: వ్యవసాయ, ఫార్మసీ వంటి మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఎంసెట్‌ సోమ, మంగళవారాల్లో జరగనుంది.
ఈ పరీక్షకు 86,644 మంది దరఖాస్తు చేసుకున్నారు. సోమవారం రెండు సెషన్లు, మంగళవారం ఒక సెషన్‌తో ఈ పరీక్ష జరగనుంది. తెలంగాణలో 81, ఏపీలో 23 కేంద్రాల్లో పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎంసెట్‌ కన్వీనర్‌ గోవర్ధన్‌ తెలిపారు.

చ‌ద‌వండి: ఆగస్టు 14న తెలంగాణ గురుకుల ఇంటర్ ప్రవేశ పరీక్ష

చ‌ద‌వండి: డిగ్రీలో క్లస్టర్ విధానం: ఒక కాలేజీలో చేరి, మరో కాలేజీలో క్లాసులు వినొచ్చు..

చ‌ద‌వండి: కొత్త జోనల్‌కు అనుగుణంగా శాఖల వారీగా త్వరలో నోటిఫికేషన్లు.. పోస్టుల భర్తీ ఈ విధంగానే..

ఇప్పటికే ఇం జనీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన ఎంసెట్‌ ఆగస్టు 4, 5, 6 తేదీల్లో జరిగిన విషయం విదితమే. కాగా, ఎంసెట్‌ కీని విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎవరికైనా అభ్యంతరాలుంటే తెలిపేందుకు కూడా అవకాశం ఉంది. అలాగే ఎంసెట్‌ ఫలితాలను ఆగస్టు 25న విడుదల చేసే అవకాశముందని జేఎన్‌టీయూ వర్గాలు వెల్లడించాయి
Published date : 09 Aug 2021 01:16PM

Photo Stories