Skip to main content

ఏపీ ఎంసెట్-2020‘ధువపత్రాల పరిశీలన’ గడువు నవంబర్ 3 వరకు పొడిగింపు

సాక్షి, అమరావతి: ఏపీ ఎంసెట్-2020 అడ్మిషన్ల ప్రక్రియకు సంబంధించి అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలనకు నవంబర్ 3 వరకు గడువు పొడిగిస్తున్నట్లు కన్వీనర్, సాంకేతిక విద్యాశాఖ ప్రత్యేక కమిషనర్ ఎం.ఎం.నాయక్ మంగళవారం తెలిపారు.
కౌన్సెలింగ్ ప్రాసెసింగ్ ఫీజును నవంబర్ 3 లోగా చెల్లించాలన్నారు. హెల్ప్‌లైన్ సెంటర్లలో కూడా ఆ రోజు వరకు ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుందన్నారు. ఇతర సమాచారానికి https://apeamcet.nic.in వెబ్‌సైట్‌లో చూడవచ్చని సూచించారు.
Published date : 28 Oct 2020 03:14PM

Photo Stories