Skip to main content

ఎంసెట్ లో 81,702 మంది ఆప్షన్ల నమోదు

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2020 అడ్మిషన్ల కౌన్సెలింగ్‌లో ఆప్షన్ల నమోదు ముగింపు గడువు అయిన డిసెంబర్ 31వ తేదీ సాయంత్రానికి 81,702 మంది ఆప్షన్లు నమోదు చేసినట్లు ఎంసెట్ కన్వీనర్, సాంకేతిక విద్యా శాఖ ప్రత్యేక కమిషనర్ ఎం.ఎం.నాయక్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
జనవరి 1న (నేడు) అభ్యర్థులు తమ ఆప్షన్లు సవరణ చేసుకొనేందుకు అవకాశం ఇస్తున్నారు. 3వ తేదీ సాయంత్రం అభ్యర్థులకు ర్యాంకు, రిజర్వేషన్లను అనుసరించి ఆయా కాలేజీల్లో సీట్లు కేటాయించనున్నారు.
Published date : 01 Jan 2021 04:36PM

Photo Stories