ఎంసెట్ లో 81,702 మంది ఆప్షన్ల నమోదు
Sakshi Education
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2020 అడ్మిషన్ల కౌన్సెలింగ్లో ఆప్షన్ల నమోదు ముగింపు గడువు అయిన డిసెంబర్ 31వ తేదీ సాయంత్రానికి 81,702 మంది ఆప్షన్లు నమోదు చేసినట్లు ఎంసెట్ కన్వీనర్, సాంకేతిక విద్యా శాఖ ప్రత్యేక కమిషనర్ ఎం.ఎం.నాయక్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
![](/sites/default/files/images/2021/01/01/weboptions19.jpg)
జనవరి 1న (నేడు) అభ్యర్థులు తమ ఆప్షన్లు సవరణ చేసుకొనేందుకు అవకాశం ఇస్తున్నారు. 3వ తేదీ సాయంత్రం అభ్యర్థులకు ర్యాంకు, రిజర్వేషన్లను అనుసరించి ఆయా కాలేజీల్లో సీట్లు కేటాయించనున్నారు.
Published date : 01 Jan 2021 04:36PM