Skip to main content

EAMCET Counselling: ఎంసెట్‌ మూడో విడత కౌన్సెలింగ్‌ చేపట్టాలి

EAMCET should conduct the 3rd phase of counselling

విజయనగరం పూల్‌బాగ్‌: ఇంజినీరింగ్‌ చదువుకున్న విద్యార్థులకు నిర్వహించాల్సిన మూడో విడత కౌన్సెలింగ్‌ వెంటనే చేపట్టాలని ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యదర్శి ఎన్‌.నాగభూషణం డిమాండ్‌ చేశారు. శుక్రవారం స్థానిక అమర్‌భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కొన్ని కళాశాలల యాజమాన్యాలు స్పాట్‌ అడ్మిషన్లు కేటాయిస్తుండడం వల్ల మూడో విడత కౌన్సెలింగ్‌ కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు అన్యాయం జరుగుతోందన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి కౌన్సెలింగ్‌ నిర్వహించాలని కోరారు. కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా సహాయ కార్యదర్శి పి.గౌరీశంకర్‌, పట్టణ కార్యదర్శి ఎ.సుమన్‌, తిరుపతి, రాము, తదితరులు పాల్గొన్నారు.

చ‌ద‌వండి: Dussehra holidays: నేటి నుంచి ట్రిపుల్‌ ఐటీలకు దసరా సెలవులు

Published date : 21 Oct 2023 03:06PM

Photo Stories