EAMCET 2022 కౌన్సెలింగ్లో సాంకేతిక విద్య శాఖ అధికారులు స్వల్ప మార్పులు చేశారు.
ఎంసెట్ కౌన్సెలింగ్ తేదీల్లో మార్పులు
ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లమెంటరీలో ద్వితీయ సంవత్సరం ఉత్తీర్ణులైవారికి అవకాశం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలంగాణ సాంకేతిక విద్య కమిషనర్ నవీన్ మిట్టల్ ఆగస్టు 30న ఒక ప్రకటనలో తెలిపారు. వాస్తవానికి తొలివిడత EAMCET రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్ గడువు ఆగస్టు 29, ధ్రువపత్రాల పరిశీలన గడువు ఆగస్టు 30తో ముగిసింది. అయితే, తాజాగా ఆగస్టు 30న ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లమెంటరీ ఫలితాలు విడుదల కావడంతో ఉత్తీర్ణులు ఎంసెట్ తొలి విడత కౌన్సెలింగ్కు హాజరయ్యే అవకాశం లేకుండా పోయింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియలో స్లాట్ బుకింగ్, ధ్రువపత్రాల పరిశీలన, ఆప్షన్లకు కొత్త తేదీలను ప్రకటించారు.