AP EAPCET – 2021: మేనేజ్మెంట్ కోటా సీట్ల కేటాయింపు
Sakshi Education
రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో మేనేజ్మెంట్ కోటా సీట్లను నవంబర్ 27న కేటాయించనున్నట్లు ఏపీఈఏపీ సెట్ అడ్మిషన్ల కన్వీనర్ డాక్టర్ పోలా భాస్కర్ నవంబర్ 26న తెలిపారు.
ఏపీఈఏపీ మేనేజ్మెంట్ కోటా సీట్ల కేటాయింపు
ఏపీఈఏపీ సెట్ పరిధిలోని వివిధ కోర్సుల సీట్లలో 70 శాతం సీట్లు కన్వీనర్ కోటా కాగా మిగతా 30 శాతం మేనేజ్మెంట్ కోటా. 2020 వరకు మేనేజ్మెంట్ కోటా సీట్లను యాజమాన్యాలే భర్తీ చేసుకునేవి. మెరిట్, రిజర్వేషన్లు పాటించకుండా భర్తీ చేసుకోవడంతోపాటు ఫీజును కూడా అత్యధికంగా వసూలు చేసేవి. వీటికి చెక్ పెడుతూ 2021 నుంచి మేనేజ్మెంట్ కోటా సీట్లను కూడా కన్వీనర్ ద్వారానే భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.