World Under-20 Wrestling Championships 2023: రెజ్లింగ్ చాంపియన్షిప్లో మోహిత్కు స్వర్ణం
Sakshi Education
ప్రపంచ అండర్–20 రెజ్లింగ్ చాంపియన్షిప్లో భారత్కు తొలి స్వర్ణపతకం లభించింది.
Mohith Kumar
ఆగస్టు 16న జరిగిన పురుషుల ఫ్రీస్టయిల్ 61 కేజీల విభాగంలో మోహిత్ కుమార్ పసిడి పతకాన్ని సాధించాడు. ఫైనల్లో మోహిత్ 9–8 పాయింట్ల తేడాతో ఎల్డర్ అఖమదునినోవ్(రష్యా)పై గెలుపొందాడు. పల్వీందర్ చీమా(2001), రమేశ్ కుమార్ (2001), దీపక్ పూనియా(2019) తర్వాత ప్రపంచ అండర్–20 చాంపియన్షిప్లో స్వర్ణ పతకం గెలిచిన నాలుగో భారతీయ రెజ్లర్గా మోహిత్ గుర్తింపు పొందాడు. భారత్కే చెందిన జైదీప్ (74 కేజీలు), దీపక్ చహల్ (97 కేజీలు)కాంస్య పతకాలు నెగ్గగా.. సాగర్ (79 కేజీలు)రజతం సాధించారు.