ప్రపంచ సీనియర్ షూటింగ్ చాంపియన్షిప్లో బుధవారం భారత్కు ఒక స్వర్ణం, ఒక కాంస్య పతకం లభించాయి.
Amanpreet singh
పురుషుల 25 మీటర్ల స్టాండర్డ్ పిస్టల్ ఈవెంట్లో అమన్ప్రీత్ సింగ్ 577 పాయింట్లతో పసిడి పతకం సొంతం చేసుకోగా... మహిళల 25 మీటర్ల స్టాండర్డ్ పిస్టల్ టీమ్ విభాగంలో టియానా, యశిత, కృతిక శర్మలతో కూడిన భారత జట్టు 1601 పాయింట్లతో కాంస్య పతకం దక్కించుకుంది.