Skip to main content

Youth World Boxing Championships: యూత్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో విశ్వనాథ్‌కు స్వర్ణం

ప్రపంచ యూత్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు తొలి స్వర్ణ పతకం లభించింది. నవంబర్‌ 25న జరిగిన పురుషుల 48 కేజీల విభాగంలో విశ్వనాథ్‌ సురేశ్‌ విజేతగా నిలిచాడు.

స్పెయిన్‌ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో ఫైనల్లో తమిళనాడుకు చెందిన విశ్వనాథ్‌ 4–1తో సుయోమ్‌ రోనెల్‌ (ఫిలిప్పీన్స్‌)పై గెలిచాడు. మరోవైపు మహిళల 48 కేజీల విభాగంలో భావన శర్మ రజత పతకం సాధించింది. ఫైనల్లో భావన 0–5తో జనియెవా (ఉజ్బెకిస్తాన్‌) చేతిలో ఓడిపోయింది.

➤ వరల్డ్‌ యంగెస్ట్‌ ఏటీపీ ప్లేయర్‌గా కార్లోస్‌ అల్కరాజ్‌

Published date : 26 Nov 2022 03:34PM

Photo Stories