Skip to main content

Men's Cricket: ఐసీసీ క్రికెట్‌ కమిటీ చైర్మన్‌గా నియమితులైన భారతీయుడు?

Sourav Ganguly

భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ ఐసీసీ క్రికెట్‌ కమిటీ (పురుషుల) చైర్మన్‌గా నియమితుడయ్యాడు. ఈ స్థానంలో గత తొమ్మిదేళ్లుగా భారత మాజీ కెప్టెన్‌ అనిల్‌ కుంబ్లే కొనసాగాడు. మూడేళ్ల పదవీ కాలానికి సంబంధించి గరిష్టంగా మూడు పర్యాయాలు చైర్మన్‌గా వ్యవహరించే వీలుంది. గరిష్ట పదవీకాలం కూడా ముగియడంతో కుంబ్లే తప్పుకోవడంతో గంగూలీని నియమించినట్లు నవంబర్‌ 17న ఐసీసీ తెలిపింది. మహిళల క్రికెట్‌ కమిటీ చైర్మన్‌గా వెస్టిండీస్‌ బోర్డు సీఈఓ జానీ గ్రేవ్‌ను నియమించారు.

ఈ కమిటీ ఏం చేస్తుంది...

ఐసీసీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ (సీఈసీ)కి ఇది సబ్‌–కమిటీ. క్రికెట్‌ ఆట విషయాలను చర్చిస్తుంది. అంపైర్లు, రిఫరీల నిర్ణయాలు, ఆటలో సాంకేతికత వినియోగం, శాశ్వత హోదా దరఖాస్తులు,  అనుమానాస్పద బౌలింగ్‌ యాక్షన్‌లపై వచ్చే ఫిర్యాదుల్ని సమీక్షించి సీఈసీకి సిఫార్సు చేస్తుంది.
చ‌ద‌వండి: 2029 చాంపియన్స్‌ ట్రోఫీకి ఆతిథ్యం ఇవ్వనున్న దేశం?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : ఐసీసీ క్రికెట్‌ కమిటీ (పురుషుల) చైర్మన్‌గా నియమితులైన క్రికెటర్‌?
ఎప్పుడు : నవంబర్‌ 17
ఎవరు    : బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ
ఎందుకు : ఇప్పటివరకు ఐసీసీ క్రికెట్‌ కమిటీ (పురుషుల) చైర్మన్‌గా ఉన్న భారత మాజీ కెప్టెన్‌ అనిల్‌ కుంబ్లే పదవీకాలం యుగియడంతో..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 18 Nov 2021 04:54PM

Photo Stories