Skip to main content

World Cup Shooting Tournament: ప్రపంచకప్‌ షూటింగ్‌ టోర్నీ - స్కిట్ లో భారత్‌కు తొలి స్వర్ణం

ISSF - International Shooting Sport Federation
ISSF - International Shooting Sport Federation

సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ... మేరాజ్‌ అహ్మద్‌ ఖాన్‌ ప్రపంచకప్‌ షూటింగ్‌ టోర్నీ చరిత్రలో పురుషుల స్కీట్‌ విభాగంలో భారత్‌కు తొలిసారి స్వర్ణ పతకాన్ని అందించాడు. దక్షిణ కొరియాలోని చాంగ్వాన్ లో జరుగుతున్న టోర్నీలో జూలై 18న జరిగిన పురుషుల స్కీట్‌ ఈవెంట్‌ ఫైనల్లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన 46 ఏళ్ల మేరాజ్‌ 40 పాయింట్లకుగాను 37 పాయింట్లు స్కోరు చేశాడు. నలుగురు పాల్గొన్న ఫైనల్లో ‘డబుల్‌ ఒలింపియన్‌’ మేరాజ్‌ అగ్రస్థానంలో నిలిచి బంగారు పతకాన్ని సాధించాడు. మిన్సు కిమ్‌ (కొరియా; 36 పాయింట్లు) రజతం, బెన్‌ లెలెవెలిన్‌ (బ్రిటన్‌; 26 పాయింట్లు) కాంస్యం గెల్చుకున్నారు. 35 మంది షూటర్ల మధ్య రెండు రోజులపాటు జరిగిన క్వాలిఫయింగ్‌ రౌండ్‌లో మేరాజ్‌ 119 పాయింట్లు స్కోరు చేసి ఎనిమిదో స్థానంలో నిలిచి ర్యాంకింగ్‌ మ్యాచ్‌లకు అర్హత సాధించాడు. నలుగురు షూటర్ల మధ్య జరిగిన రెండో ర్యాంకింగ్‌ మ్యాచ్‌లో మేరాజ్‌ 27 పాయింట్లు స్కోరు చేసి ఫైనల్‌కు దూసుకెళ్లాడు. 2016 రియో డి జనీరో ప్రపంచకప్‌ టోరీ్నలో మేరాజ్‌ రజత పతకం సాధించాడు. మహిళల 50 మీటర్ల రైఫిల్‌ త్రీ పొజిషన్‌ టీమ్‌ ఈవెంట్‌లో అంజుమ్‌ మౌద్గిల్, ఆశీ చౌక్సీ, సిఫ్ట్‌కౌర్‌ సామ్రాలతో కూడిన భారత జట్టు కాంస్య పతకం గెల్చుకుంది. కాంస్య పతక పోరులో భారత్‌ 16–6తో ఆ్రస్టేలియాను ఓడించింది. ఈ టోర్నీలో భారత్‌ ఐదు స్వర్ణాలు, ఐదు రజతాలు, మూడు కాంస్యాలతో కలిపి మొత్తం 13 పతకాలతో టాప్‌ ర్యాంక్‌లో కొనసాగుతోంది.

Also read: Weekly Current Affairs (Important Dates) Bitbank: ప్రపంచ థైరాయిడ్ దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు?

 Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

 

Published date : 19 Jul 2022 06:09PM

Photo Stories