Skip to main content

Hockey Captain: అనారోగ్యంతో కన్నుమూసిన భారత హాకీ దిగ్గజం?

Charanjit Singh - Hockey

భారత హాకీ మాజీ ఆటగాడు, 1964 టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన జట్టు కెప్టెన్‌ చరణ్‌జిత్‌ సింగ్‌(90) కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా జనవరి 27న హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రం, ఉనా జిల్లా, ఉనాలోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. 1964 ఒలింపిక్స్‌ ఫైనల్లో భారత్‌ 1–0తో పాక్‌ను ఓడించి బంగారు పతకం గెలుచుకుంది. 1960 రోమ్‌ ఒలింపిక్స్‌లోనే రజత పతకం సాధించిన జట్టులో సభ్యుడైన చరణ్‌జిత్‌... 1962లో ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన టీమ్‌లోనూ ఉన్నారు.

ఇషా సింగ్‌ ఏ క్రీడలో ప్రావీణ్యం కలిగి ఉంది?

2022, ఫిబ్రవరిలో ఈజిప్టు రాజధాని నగరం కైరో వేదికగా జరిగే ప్రపంచకప్‌ షూటింగ్‌ టోర్నీలో పాల్గొనే భారత జట్టును ప్రకటించారు. హైదరాబాద్‌ యువ షూటర్‌ ఇషా సింగ్‌ 25 మీటర్ల స్పోర్ట్స్‌ పిస్టల్, 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ వ్యక్తిగత విభాగాలలో... 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ విభాగంలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించనుంది. జాతీయ చాంపియన్‌షిప్‌లో కనబరిచిన ప్రదర్శన ఆధారంగా జట్టును ఎంపిక చేశారు.

చ‌ద‌వండి: ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టోర్నీలో ఫైనల్‌ చేరిన ఆసీస్‌ క్రీడాకారిణి?

క్విక్‌ రివ్యూ   : 
ఏమిటి    :
భారత హాకీ మాజీ ఆటగాడు కన్నుమూత
ఎప్పుడు : జనవరి 27
ఎవరు    : చరణ్‌జిత్‌ సింగ్‌(90)
ఎక్కడ    : ఉనా, ఉనా జిల్లా, హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రం
ఎందుకు : అనారోగ్యం కారణంగా..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 28 Jan 2022 02:56PM

Photo Stories