Skip to main content

Chess: వెర్గాని కప్‌ టోర్నీలో చాంపియన్‌గా నిలిచిన భారతీయుడు?

MR Lalith Babu

వెర్గాని కప్‌ అంతర్జాతీయ చెస్‌ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌ మాస్టర్‌ ముసునూరి రోహిత్‌ (ఎంఆర్‌) లలిత్‌ బాబు చాంపియన్‌గా నిలిచాడు. ఇటలీలోని కటోలికా పట్టణం వేదికగా జనవరి 9న ముగిసిన ఈ టోర్నీలో లలిత్‌ నిర్ణీత తొమ్మిది రౌండ్ల తర్వాత ఏడు పాయింట్లతో మరో ముగ్గురితో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. అయితే మెరుగైన టైబ్రేక్‌ స్కోరు ఆధారంగా లలిత్‌కు టైటిల్‌ లభించింది. విజయవాడకు చెందిన 29 ఏళ్ల లలిత్‌ 2021, డిసెంబర్‌ నెలలో థాయ్‌లాండ్‌ చెస్‌ ఫెస్టివల్‌లో క్లాసికల్, బ్లిట్జ్‌ విభాగాల్లో టైటిల్స్‌ సాధించాడు.

GK Sports Quiz: సీనియర్ మహిళల జాతీయ ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్న రాష్ట్రం?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
వెర్గాని కప్‌ అంతర్జాతీయ చెస్‌ టోర్నమెంట్‌లో చాంపియన్‌గా నిలిచిన భారతీయుడు? 
ఎప్పుడు : జనవరి 9
ఎవరు    : ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌ మాస్టర్‌ ముసునూరి రోహిత్‌ (ఎంఆర్‌) లలిత్‌ బాబు
ఎక్కడ    : కటోలికా, ఇటలీ

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 10 Jan 2022 01:22PM

Photo Stories