Skip to main content

India vs Pakistan T20 World cup : పాక్‌పై భార‌త్‌ ఘన విజయం.. ఉత్కంఠ పోరు సాగిందిలా..

అఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై 4 వికెట్ల తేడాతో భారత్ ఘ‌న విజయం సాధించింది. చివరి బంతి వరకూ నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగిన ఈ మ్యాచ్‌లో భారత్‌ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది.
virat kohli

మెల్‌బోర్న్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లీ (82*) ఒంటి చేత్తో టీమ్‌ఇండియాను గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో 53 బంతులు ఎదుర్కొన్న కోహ్లి 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 82 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. కోహ్లితో పాటు హార్దిక్‌ పాండ్యా(37 బంతుల్లో 40) పరుగులతో కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. పాక్‌ బౌలర్లలో రౌఫ్‌, నవాజ్‌ రెండు వికెట్లు సాధించారు. అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన పాకిస్తాన్‌  నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. చివరి ఓవర్లలో ఒత్తిడి కారణంగా పాకిస్థాన్‌ చేసిన తప్పిదాలు టీమిండియాకు వరంలా మారాయి.

టీమిండియా ఇదే :

రోహిత్ శర్మ(కెప్టెన్‌), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్(వికెట్‌ కీపర్‌), అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్

పాకిస్తాన్ ఇలా..:

బాబర్ ఆజం(కెప్టెన్‌), మహ్మద్ రిజ్వాన్(వికెట్‌ కీపర్‌), షాన్ మసూద్, హైదర్ అలీ, మహ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్, ఇఫ్తికార్ అహ్మద్, ఆసిఫ్ అలీ, షాహీన్ అఫ్రిది, హారీస్ రవూఫ్, నసీమ్ షా

Published date : 23 Oct 2022 05:55PM

Photo Stories