Skip to main content

SpaceX: రోదసిలోకి వెళ్లిన 600వ యాత్రికుడు ఎవరు?

Crew 3

మానవుని అంతరిక్ష ప్రయాణం మొదలైన గడిచిన 60 ఏళ్లలో.. 600 మంది రోదసిలోకి వెళ్లారు. తాజాగా, స్పేస్‌ఎక్స్‌ రాకెట్‌ ద్వారా నలుగురు వ్యోమగాములు భూకక్ష్యలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి బయలుదేరి వెళ్లడంతో ఈ మైలురాయిని అధిగమించినట్లయింది. మిషన్‌ కమాండర్, భారతీయ మూలాలున్న రాజాచారి(44) నేతృత్వంలోని నలుగురు సభ్యుల బృందంలో జర్మనీకి చెందిన మథియాస్‌ మౌరెర్‌(51) 600వ యాత్రికునిగా నమోదయ్యాడు. ఈ బృందాన్ని తీసుకుని నవంబర్‌ 10న ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్‌ సెంటర్‌ నుంచి స్పేస్‌ఎక్స్‌ ఫాల్కన్‌ రాకెట్‌(స్పేస్‌ఎక్స్‌–3) నింగిలోకి దూసుకెళ్లింది. అనంతరం తాము అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నట్లు రాజాచారి సమాచారం పంపించారు. ఈ బృందం అంతరిక్ష కేంద్రంలో ఆరు నెలలపాటు గడుçపనుంది. రష్యాకు చెందిన యూరి గగారిన్‌ 1961లో మొదటిసారిగా అంతరిక్షంలోకి వెళ్లి వచ్చాక ఏడాదికి సగటున 10 మంది రోదసి యానం చేశారు.

తెలుగువాడే..

స్పేస్‌ఎక్స్‌–3 ద్వారా అంతరిక్షంలోకి వెళ్లిన రాజాచారి తెలంగాణ మూలాలు ఉన్న వ్యక్తి. రాజాచారి తండ్రి శ్రీనివాసాచారి మహబూబ్‌ నగర్‌ జిల్లాకు చెందిన వారు. 1977 జూన్‌ 24న అమెరికాలోని లూనీ మిల్వాకీలో జన్మించిన చారి రాజాచారి పూర్తి పేరు రాజా జాన్‌ వీర్‌పుత్తూర్‌ చారి.
 

చ‌ద‌వండి: శనగల సంపూర్ణ జన్యుక్రమాన్ని నమోదు చేసిన సంస్థ?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : రోదసిలోకి వెళ్లిన 600వ యాత్రికునిగా నమోదు
ఎప్పుడు : నవంబర్‌ 10
ఎవరు    : జర్మనీకి చెందిన మథియాస్‌ మౌరెర్‌(51)
ఎక్కడ    : కెన్నడీ స్పేస్‌ సెంటర్, ఫ్లోరిడా, అమెరికా
ఎందుకు : తాజాగా, స్పేస్‌ఎక్స్‌ రాకెట్‌ ద్వారా మథియాస్‌ మౌరెర్‌ కూడిన బృందం భూకక్ష్యలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి బయలుదేరి వెళ్లడంతో...

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 12 Nov 2021 02:52PM

Photo Stories