Skip to main content

Telangana Farmers: దేశంలో తెలంగాణ‌ రైతుల స్థానం.. అప్పుల్లో 5, ఆదాయంలో 25

మన రైతన్నలు ఆ­దా­యంలో బాగా వెనుకంజలో ఉన్నారు. అప్పుల భారం కూడా భారీగానే ఉంది. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి. నెలకు సగటున రూ.10,218 ఆదాయం మాత్రమే పొందుతున్నాడు.

అంటే రోజుకు రూ.340 మా­త్ర­మే. అదే సమయంలో ఒక్కో రైతుకు స­గటు­న రూ.74,121 అప్పు ఉంది. ఇక రాష్ట్ర రైతులు అప్పుల్లో దేశంలో ఐదో స్థానంలో, ఆదాయంలో 25వ స్థానంలో ఉంది. 2018 జూలై నుంచి 2019 జూన్‌ వరకు దేశంలోని వ్యవసాయ కుటుంబాలు, రైతుల అప్పు, ఆదాయంపై సర్వే జరిగింది. సర్వే వివరాలు ఇటీవల పార్లమెంటులో చర్చకు రాగా.. అందుకు సంబంధించి కేంద్ర వ్యవసాయ శాఖ ఓ నివేదిక విడుదల చేసింది. రైతు కోసం ఎన్ని పథకాలు తీసు­కొస్తున్నా రైతు పరిస్థితి పూర్తిస్థాయిలో బాగు­ప­డటం లేదు. స్వామినాథన్‌ సిఫారసు­ల ప్రకారం పంటలకు గిట్టుబాటు ధరలు ల­భిం­చ­కపోవడమే ఇందుకు కారణమని నిపు­ణులు చెబుతున్నారు.

Jogulamba Temple: జోగులాంబ ఆలయానికి అంతర్జాతీయ అవార్డు

రోజుకు రూ.313 మాత్రమే
కేంద్రం విడుదల చేసిన నివేదిక ప్రకారం రాష్ట్ర రైతులు అప్పుల్లో దేశంలో ఐదో స్థానంలో నిలిచారు. తెలంగాణ రైతుల అప్పు సగటున రూ.1,52,113గా ఉంది. రైతు కుటుంబసభ్యుల సగటు ఆదాయం నెలకు రూ.9,403గా ఉంది. ఏడాదికి రూ.1,12,836. అంటే రోజుకు రూ.313 మాత్రమేనన్న మాట. ఇది ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సగటు జీతం కంటే దాదాపు సగం తక్కువ. ఇక ఆదాయంలో తెలంగాణ రైతు దేశంలో 25వ స్థానంలో ఉన్నాడని నివేదిక వెల్లడించింది. అత్యధికంగా మేఘాలయ రైతు సగటున నెలకు రూ. 29,348 ఆదాయం పొందుతున్నాడు. పంజాబ్‌ రైతు రూ. 26,701, హరియాణ రైతు రూ.22,841, అరుణాచల్‌ప్రదేశ్‌ రైతు రూ. 19,225 పొందుతున్నాడని కేంద్రం తెలిపింది. 

Telangana: అటవీ విస్తీర్ణంలో తెలంగాణకు రెండోస్థానం

Published date : 27 Dec 2022 03:48PM

Photo Stories