తెలంగాణలో schneider రెండో ప్లాంట్
![Schneider Electric India to set up 2nd unit in Telangana](/sites/default/files/images/2022/09/30/schneider-2nd-plant-1664541611.jpg)
విద్యుత్ పరికరాల తయారీ, ఆటోమేషన్ రంగంలో ఉన్న ష్నైడర్ ఎలక్ట్రిక్ తెలంగాణలో మరో ప్లాంట్ ఏర్పాటు చేస్తోంది. శంషాబాద్ వద్ద 18 ఎకరాల్లో ఇది రానుంది. రూ. 300 కోట్ల వ్యయంతో చేపడుతున్న తొలి దశ 2023 సెప్టెంబర్కు సిద్ధం అవుతుంది. ఉత్పత్తుల తయారీకి స్మార్ట్ యంత్రాలు, ఉపకరణాలను ఉపయోగించనున్నట్లు కంపెనీ సెప్టెంబర్ 30న ప్రకటించింది. కొన్ని ఉత్పత్తులను దేశంలో తొలిసారిగా శంషాబాద్ కేంద్రంలో ఉత్పత్తి చేయనున్నట్లు వెల్లడించింది. 30కిపైగా దేశాలకు ఇక్కడ తయారైన సరుకు ఎగుమతి చేస్తారు. భారత్లో సంస్థకు ఇది 31వ కేంద్రం కాగా తెలంగాణలో రెండవది. స్మార్ట్ ఫ్యాక్టరీలపరంగా కంపెనీకి దేశంలో ఇది ఎనిమిదవది కానుంది.
వర్చువల్ గా శంకుస్థాపన
భారత్లో ఫ్రాన్స్ రాయబారి ఎమాన్యుయల్ లెనిన్తో కలిసి రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె. తారక రామారావు ష్నైడర్ ప్రతిపాదిత నూతన కేంద్రానికి వర్చువల్గా శంకుస్థాపన చేశారు. కొత్త ప్లాంటు మూడు దశలు పూర్తి అయితే 3,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి తెలిపారు. భారత్లో కంపెనీకి ఇది అతిపెద్ద, అత్యంత స్మార్ట్ ఫ్యాక్టరీ అవుతుందని చెప్పారు. 75 శాతం ఉత్పత్తులు ఇక్కడి నుంచి ఎగుమతి అవుతాయని వివరించారు. స్మార్ట్ మాన్యుఫ్యాక్చరింగ్లో యువతకు శిక్షణ ఇచ్చేందుకు ముందుకు రావాల్సిందిగా కంపెనీ ప్రతినిధులను ఆయన కోరారు.
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP