Skip to main content

India Today Education Summit 2024: తిరుపతి ఇండియా టుడే ఎడ్యుకేషన్‌ సమ్మిట్‌లో పాల్గొన్న‌ సీఎం జగన్

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జ‌న‌వ‌రి 24వ తేదీ తిరుపతిలో జరిగిన‌ ఇండియా టుడే విద్యా సదస్సులో పాల్గొన్నారు.
CM Jagan Mohan Reddy and Rajdeep Sardesai addressing education issues  Andhra Pradesh Chief Minister at the education priorities discussion   India Today Education Summit 2024 in Tirupati   CM Jagan participating in education priorities discussion

ఈ సంద‌ర్భంగా విద్యా సంస్కరణలు, ప్రాధాన్యతలపై సీఎం జగన్‌, సీనియర్‌ జర్నలిస్ట్‌ రాజ్‌దీప్‌ సర్‌దేశాయ్‌ మ‌ద్య జ‌రిగిన చర్చలు ఇవే..  

సీఎం జగన్‌ : 
➤ ఒక ఆలోచనకు ప్రయత్నం జోడిస్తున్నాం.
➤ IB, ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కలిసి పని చేస్తున్నాయి.
➤ IBతో చర్చలు జరిపి మాతో కలిసి పని చేసేలా వారిని ఒప్పించాం.
➤ ఇందుకు వారిని అభినందిస్తున్నాను.
➤ ఫలితంగా IB తన అధికారిక కార్యాలయాన్ని SCERTతో కలిసి ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేస్తోంది.
➤ ఇది విప్లవాత్మకమైన మార్పుకు నాంది.
➤ 2035 నాటికి IBలో చదువుకున్న విద్యార్థులు పదో తరగతిలో ప్రవేశిస్తారు.
ఈ లక్ష్యంతోనే మేం పని చేస్తున్నాం.

రాజ్‌దీప్‌ :
➤ అది గొప్ప దార్శనికతే.
➤ గుంటూరు జిల్లాలోని ఓ మారుమూల పల్లె నుంచి వచ్చిన విద్యార్థి పోటీ పడాలన్న ఆలోచన మంచిదే.
➤ కానీ విద్యార్థులకు మంచి బోధన అందించేందుకు నాణ్యమైన ఉపాధ్యాయులు ఉన్నారనుకుంటున్నారా?

సీఎం జగన్‌ :
➤ ఐబీ సిలబస్‌ మన రాష్ట్ర సెకండరీ ఎడ్యుకేషన్‌ బోర్డుతో చేతులు కలిపింది.
➤ IB అన్నది ప్రస్తుతం ఉపాధ్యాయుల నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు మాత్రమే ఉపయోగిస్తున్నాం.
➤ జూన్‌ 2025 తర్వాత మొదటి తరగతిలో IB సిలబస్‌ ప్రవేశపెడతాం.
➤ అక్కడి నుంచి దశలవారీగా ఏడో తరగతి వరకు ప్రవేశపెడతాం.
➤ ఐదేళ్ల తర్వాత మన రాష్ట్ర విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో బ్యాక్యులరేట్‌ సర్టిఫెకెట్‌ కోసం పోటీ పడతారు.
➤ ఈ ప్రయత్నం ఎందుకంటే.. విద్యలో నాణ్యత అనేది చాలా ముఖ్యం.
అదే లేకుంటే మా రాష్ట్ర విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడలేరు కదా..
➤ ఈ పోటీలో కేవలం ధనికులు మాత్రమే గెలిచే పరిస్థితి ఉండకూడదు,
అణగారిన వర్గాల వారికి కూడా అవకాశం దక్కాలి

రాజ్‌దీప్‌ :
➤ ప్రభుత్వాల్లో పనులు అంత వేగంగా జరగవని చెబుతారు,
➤ మీరు మీ యంత్రాంగాన్ని తగిన విధంగా ప్రోత్సహిస్తున్నారా?
➤ IB సిలబస్‌ కూడా ప్రవేశపెట్టారా?
➤ అది కేవలం కొన్ని నగరాల్లోనే అందుబాటులో ఉంది కదా.?
➤ అయితే ఇదంతా తొందరపడి చేస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి..
➤ తల్లితండ్రులు కూడా ఆశ్చర్యపోతున్నారు ఇంత మంచి అవకాశం ఎలా వచ్చిందని.?

సీఎం జగన్‌ :
➤ 8వ తరగతి, 9వ తరగతి విద్యార్థులకు ఇప్పటికే టాబ్‌లున్నాయి.
➤ డిసెంబర్‌ 21న టాబ్‌లు ఇచ్చాం.
➤ నా పుట్టిన రోజు నాడు నేనే తరగతి గదికి వెళ్లి పిల్లలను కలిసి వాళ్లకు టాబ్‌ అందజేస్తాం.

రాజ్‌దీప్‌ :
➤ 8వ తరగతి విద్యార్థికి టాబ్‌ ఇచ్చారా?
➤ కోవిడ్‌ సమయంలో తగిన సాధన సంపత్తి (టీవీలు, మొబైళ్లు, టెక్నాలజీ) లేకపోవడం వల్ల చాలా మంది విద్యార్థులు చదువుకు దూరమయ్యారు?
➤ ఏపీ కూడా ఇందుకు మినహాయింపు కాదు కదా.?
➤ వచ్చే మూడేళ్లలో పదో తరగతి విద్యార్థులందరికీ టాబ్‌లు ఉంటాయని నమ్మకంగా చెప్పగలరా?

సీఎం జగన్‌ :
➤ ఇలా జరక్కుండా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం.
➤ పాఠ్యపుస్తకాల్లో ఒక పేజీలో తెలుగు, మరో పేజీలో ఇంగ్లీష్‌ పెట్టాం.
➤ మా బోధనకు అదనంగా అంతర్జాతీయ ఖ్యాతి గడించిన బైజూస్‌ అంశాలను చేర్చాం.
➤ పాఠశాలలు అన్నింటిలోనూ సౌకర్యాలు మెరుగుపరిచాం. 
➤ ఒక విధంగా చెప్పాలంటే సమగ్ర ప్రణాళికతో వీటిని అమల్లోకి తెచ్చాం.
➤ నాడు-నేడు తీసుకొచ్చి పాఠశాలలో మౌలిక సదుపాయాలు మెరుగుపరిచాం.
➤ 62 వేల తరగతి గదులుంటే.. 40 వేల తరగతి గదుల్లో ఇంటరాక్టివ్‌ టీవీలు ఏర్పాటు చేశాం.
➤ ఈ నెలాఖరుకల్లా మిగతా చోట కూడా పూర్తవుతాయి.
➤ టీచర్లకు తగిన శిక్షణ కూడా ఇవ్వడం ద్వారా ప్రణాళికకు ఒక సమగ్ర రూపం తీసుకొచ్చాం.
➤ 8వ తరగతి విద్యార్థులందరికీ ఒక ఆధునికమైన టాబ్‌ నేర్చుకునేందుకు అందించాం.

రాజ్‌దీప్‌ :
➤ అకస్మాత్తుగా ఇంగ్లీషు మీడియం ప్రవేశపెడితే విద్యార్థులు పాఠశాల మానేసే ప్రమాదం లేదా? 

సీఎం జగన్‌ :
➤ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం బోధించేలా చేయరాదని విమర్శించే వాళ్ల పిల్లలు ఏ మీడియంలో చదువుతున్నారు?
నన్ను, ప్రభుత్వ విధానాలను విమర్శించే ముందు మీ విధానాలను ప్రశ్నించుకోండి 

రాజ్‌దీప్‌ :
➤ మూడో తరగతి నుంచే గ్లోబల్‌ ఎగ్జామ్‌ టోఫెల్‌ లాంటిపై అవగాహన కల్పించేలా చేసిన మార్పులపై విమర్శలొచ్చాయి.
➤ తెలుగు మీడియంలోనే బోధించాలని విమర్శలు చేశారు కదా.?

సీఎం జగన్‌ :
➤ ఇండియా టుడే జర్నలిస్టులు తిరుపతిలోని ప్రభుత్వ పాఠశాలలు చూడడం గొప్ప విషయం
➤ పేదరికం తొలగించేందుకు చదువుపై పెట్టుబడి పెట్టడం మినహా మరో మార్గం లేదన్నది నా బలమైన నమ్మకం
➤ నాణ్యమైన విద్య అందుకోవడం ప్రతీ ఒక్కరి హక్కు కావాలి
➤ పేదలు చదివేది ఒకటయితే, ధనిక పిల్లలు చదివేది మరొకటి
పేదలకు తెలుగు మీడియంలో బోధన జరిగేది, ధనిక పిల్లలు ఇంగ్లీషులో చదివేవారు

రాజ్‌దీప్‌ :
➤ తిరుపతి లాంటి ఆధ్యాత్మిక నగరంలో విద్యపై సదస్సు నిర్వహించడం సంతోషకరం,
➤ చదువుతో వచ్చే మార్పు ఏంటన్నది కొత్తగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు,
➤ ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు ఆ మార్పే చోటు చేసుకోబోతుంది.
➤ ఏపీలోని అత్యంత సామాన్య విద్యార్థులు అమెరికాలోని వాషింగ్టన్‌ డీసీని పర్యటించడం గొప్ప విషయం

Published date : 25 Jan 2024 09:11AM

Photo Stories