Skip to main content

Andhra Pradesh: వైఎస్సార్‌ సున్నా వడ్డీ మూడో విడత కార్యక్రమాన్ని ఎక్కడ ప్రారంభించారు?

AP CM Jagan - YSR Sunna Vaddi

పొదుపు సంఘాల మహిళలకు చేయూతనందించేందుకు ఉద్దేశించిన ‘‘వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం’’ కింద మూడో విడత నగదు జమ కార్యక్రమాన్ని ఏప్రిల్‌ 22న ఒంగోలులో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి కోటి 2 లక్షల 16 వేల 410 మంది మహిళల ఖాతాల్లో రూ.1,261 కోట్లు జమ చేశారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. సున్నా వడ్డీ పథకం కింద ఈ మూడు సంవత్సరాల్లో రూ.3,615 కోట్లు అందజేశామని చెప్పారు. కేవలం ఈ 35 నెలల కాలంలో రూ.1,36,694 కోట్లు నేరుగా ప్రజల చేతుల్లో పెట్టామని సగర్వంగా చెబుతున్నానన్నారు.

Andhra Pradesh: ఆదిత్య బిర్లా కాస్టిక్‌ సోడా యూనిట్‌ను ఎక్కడ ప్రారంభించారు?

పొదుపు సంఘాల మహిళలకు చేయూతనందించేందుకు ఉద్దేశించిన ఈ పథకం తొలుత 2020, ఏప్రిల్‌ 24న ప్రారంభమైంది. ఈ పథకం ద్వారా పొదుపు సంఘాల మహిళలు బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలపై వడ్డీ భారాన్నంతటినీ ఇకపై ప్రభుత్వమే భరించనుంది.

GK International Quiz: నాటో సైనిక వ్యాయామం 'కోల్డ్ రెస్పాన్స్ 2022' ఎక్కడ జరిగింది?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
వైఎస్సార్‌ సున్నా వడ్డీ మూడో విడత కార్యక్రమాన్ని ఎక్కడ ప్రారంభించారు?
ఎప్పుడు : ఏప్రిల్‌ 22
ఎవరు    : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ    : ఒంగోలు, ప్రకాశం జిల్లా
ఎందుకు : పొదుపు సంఘాల మహిళలకు చేయూతనందించేందుకు..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 23 Apr 2022 04:58PM

Photo Stories