Skip to main content

Andhra Pradesh: రాష్ట్రంలోని ఏ నగరంలో అంబేడ్కర్‌ స్మృతివనం ఏర్పాటు చేయనున్నారు?

BR Ambedkar Statue

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం, కృష్ణా జిల్లా, విజయవాడ నగరంలో.. భారతరత్న డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ 125 అడుగుల కాంస్య విగ్రహం, స్మృతివనం ఏర్పాటు చేయనున్నారు. వీటికి సంబంధించిన పనులు చేసేందుకు వీలుగా ఇక్కడి స్వరాజ్‌ మైదాన్‌లో ఉన్న 42 కట్టడాలను తొలగించగా ఆ భూమిని జిల్లా కలెక్టర్‌ జె. నివాస్‌.. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖకు ఇప్పటికే అప్పజెప్పారు. 18 ఎకరాల విస్తీర్ణంలో రూ.249 కోట్లతో ఇక్కడ అంబేడ్కర్‌ స్మృతివనం ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం విదితమే. ఈ పనుల నిర్వహణ బాధ్యతను కేపీసీ ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌ సంస్థ దక్కించుకుంది. పనుల పర్యవేక్షణకు నోడల్‌ ఏజెన్సీగా సాంఘిక సంక్షేమ శాఖ, కార్యనిర్వహణ ఏజెన్సీగా ఏపీఐఐసీ వ్యవహరిస్తున్నాయి. స్మృతి వనంలో మెమోరియల్‌ పార్కు, అధ్యయన కేంద్ర నిర్మాణం చేపట్టనున్నారు. అన్ని పనులు పూర్తిచేసుకుని మార్చి 31, 2023 నాటికి విగ్రహాన్ని ఏర్పాటుచేసే విధంగా కాల పరిమితిని నిర్ణయించారు.

దుబాయ్‌ ఎక్స్‌పోలో ఏపీ పెవిలియన్‌

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం దుబాయ్‌ ఎక్స్‌పో–2020 వేదికను వినియోగించుకుంటోంది. దుబాయ్‌లో ఫిబ్రవరి 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు జరిగే పెట్టుబడుల సదస్సులో ఏపీ పెవిలియన్‌ పేరిట ప్రత్యేక వేదికను ఏర్పాటు చేసి రాష్ట్రంలోని పెట్టుబడుల అవకాశాలను విదేశీ ఇన్వెస్టర్లకు వివరించనుంది.

చ‌ద‌వండి: రాష్ట్రంలోని ఏ జిల్లాలో నేషనల్‌ లా యూనివర్సిటీ ఏర్పాటు కానుంది?

క్విక్‌ రివ్యూ :
ఏమిటి :
రాష్ట్రంలోని ఏ నగరంలో బీఆర్‌ అంబేడ్కర్‌ 125 అడుగుల కాంస్య విగ్రహం, స్మృతివనం ఏర్పాటు ఏర్పాటు చేయనున్నారు?
ఎప్పుడు : ఫిబ్రవరి 10
ఎవరు : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం
ఎక్కడ : విజయవాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్‌

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 11 Feb 2022 04:25PM

Photo Stories